Advertisement

  • తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గా సునీత లక్ష్మారెడ్డి

తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గా సునీత లక్ష్మారెడ్డి

By: Sankar Mon, 28 Dec 2020 07:50 AM

తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గా సునీత లక్ష్మారెడ్డి


తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ను ప్రభుత్వం నియమించింది. చైర్ పర్సన్ గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని నియమించారు. చైర్ పర్సన్ తో పాటుగా మరో 6 మంది సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. గతంలో సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ నుండి వరసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

1999, 2004,2009 వ సంవత్సరాల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో సునీతా లక్ష్మారెడ్డి మంత్రిగా పనిచేశారు. అయితే, 2014లో జరిగిన మెదక్ ఉప ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి సునీత లక్ష్మారెడ్డి ఓటమిపాలయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కొద్దిరోజులకే ఆమెకు తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి లభించడం విశేషం.

Tags :
|

Advertisement