Advertisement

  • నేరెడిమేట్ డివిజన్ లో రీకౌంటింగ్ లో విజయం సాధించిన తెరాస పార్టీ

నేరెడిమేట్ డివిజన్ లో రీకౌంటింగ్ లో విజయం సాధించిన తెరాస పార్టీ

By: Sankar Wed, 09 Dec 2020 11:43 AM

నేరెడిమేట్ డివిజన్ లో రీకౌంటింగ్ లో విజయం సాధించిన తెరాస పార్టీ


జిహెచ్ఎంసి ఎన్నికల్లో పెండింగ్ లో ఉన్న నేరెడిమేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది..ఓట్ల లెక్కింపు తర్వాత తెరాస పార్టీ ఆ డివిజన్ లో విజయం సాధిచింది..

స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర గుర్తులు ఉన్న ఓట్లను హైకోర్టు ఆదేశాలతో ముందు లెక్కించకుండా పక్కన పెట్టారు అధికారులు. అయితే మరాలా ఆ చెల్లని ఓట్లను లెక్కించాలని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఆ వోట్లను లెక్కించారు. నేరేడ్మెట్ డివిజన్ రీ కౌంటింగ్ లో టిఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి 782 ఓట్లతో విజయం సాదించారు..

అయితే ఎన్నికల అధికారుల తీరుపై బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసి ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ కన్నీటి పర్యంతమయ్యారు ప్రసన్న. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్ట్ పేర్కొంది

Tags :
|

Advertisement