Advertisement

  • టీఆర్ఎస్ పార్టీకి మరో నేత షాక్ ఇచ్చారు... కారు పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ గూటికి...!

టీఆర్ఎస్ పార్టీకి మరో నేత షాక్ ఇచ్చారు... కారు పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ గూటికి...!

By: Anji Tue, 17 Nov 2020 5:09 PM

టీఆర్ఎస్ పార్టీకి మరో నేత షాక్ ఇచ్చారు... కారు పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ గూటికి...!

గ్రేటర్ ఎన్నికలకన్న ముందే.. పార్టీల వలసలు ఊపందుకున్నాయి. ఒకపార్టీ నుంచి మరొక పార్టీలోకి ఆశావహులు చేరిపోతున్నారు. వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలు ఆయా పార్టీలకు షాక్ ఇస్తున్నారు.

ఇప్పటికే బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లోకి, టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పలువురు నేతలు చేరిపోయారు. తాజాాగా అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో నేత షాక్ ఇచ్చారు. ఇప్పటికే పలువురు సీనియర్లు, మాజీలు కారు పార్టీకి గుడ్ బై చెప్పేసి కాషాయం కండువా కప్పేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా టీఆర్‌ఎస్‌ అల్లాపూర్‌ డివిజన్‌ సీనియర్‌ నేత పులిగోళ్ల శ్రీనివాస్‌ యాదవ్ కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

‌కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సమక్షంలో శ్రీనివాస్ యాదవ్ బీజేపీలో చేరారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు కార్యకర్తలతో కలిసి ఆయన బీజేపీలో చేరారు.

మాజీ కౌన్సిలర్‌ పన్నాల హరీష్‌ రెడ్డితో కలిసి శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేస్తానన్నారు యాదవ్.

బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోందన్నారు. మరోవైపు అల్లాపూర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఎదిగిన శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు పలువురు కార్యకర్తలు కూడా బీజేపీలో చేరారు.

Tags :

Advertisement