Advertisement

  • సీనియర్ నేత , తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి

సీనియర్ నేత , తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి

By: Sankar Tue, 01 Dec 2020 10:40 AM

సీనియర్ నేత , తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి


నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

ఇవాళ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో దవాఖానకు తరలించారు. కాగా చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. కాగా, గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. నెలరోజుల క్రితం కరోనా బారినపడ్డారు. అయితే చికిత్స అనంతరం కరోనా నెగెటివ్‌ వచ్చినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు.

కాగా నోముల నర్సింహయ్య అకాల మరణంపట్ల ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ వెంట నడిచిన గొప్పనాయకులన్నారు. నోముల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags :
|
|

Advertisement