Advertisement

  • తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

By: Sankar Wed, 16 Dec 2020 8:55 PM

తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి


మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి... ప్రభుత్వ పథకాలను రద్దు చేసి.. ఎన్నికలకు ఓ ఏడాది ముందు మళ్లీ ప్రారంభించాలని.. తాను సీఎం కేసీఆర్‌ను కలిసి చెప్పాలని అనుకుంటున్నానని ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది..

అయితే, నిన్న తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ఆయన.. తాను అభివృద్ది చేసిన వారికి మాత్రమే ఓటేయ్యాలని కోరాను.. అది ఎవ్వరైనా, ఏ ప్రభుత్వమై సరే అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత 70 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చాయా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కటిక చీకటేనంటూ ఒక ముఖ్యమంత్రి అనలేదా? అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నది తమ ప్రభుత్వం మాత్రమే. ఈ విషయం పై చర్చజరగాలంటూ తాను సూచించానన్నారు లక్ష్మారెడ్డి.. తాను నిన్న చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి..

Tags :

Advertisement