టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా పాజిటివ్
By: chandrasekar Mon, 15 June 2020 2:59 PM
రాష్ట్రంలో వైరస్ ప్రభావం
రోజురోజుకి అధికమవుతున్న ఈ సమయంలో తెలంగాణకు చెందిన మరో అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా వైరస్
పాజిటివ్ నిర్దారణ అయింది. నిజామాబాద్
రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారిన పడ్డారు. ఆయన నిజామాబాద్ నుంచి
హైదరాబాద్లో ఆస్పత్రిలో చికిత్సకు చేరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్ఠాత్మకంగా బీబీపూర్ తండాలో నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్లను లాటరీ ద్వారా
లబ్ధిదారులకు పట్టాలను నిన్న అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి
గోవర్ధన్ కూడా పాల్గొన్నారు.
అలాగే, బీజేపీ
నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిన మెంట్రాజ్పల్లి మాజీ సర్పంచ్ అంబర్
సింగ్ రాథోడ్, మరికొందరు కార్యకర్తలను పార్టీ కండువా కప్పి
ఆహ్వానించారు. రెండు రోజుల క్రితం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి
కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స
పొందుతున్నారు. అధికమవుతున్న కరోనా కేసుల వల్ల మీటింగులు మరియు ప్రారంభోత్సవ
కార్యక్రమాలను నిలుపుదల చేయాలని ప్రజలు మనవి చేసుకుంటున్నారు.