బండి సంజయ్ పై ఫైర్ అయిన తెరాస నేత బాల్క సుమన్
By: Sankar Tue, 15 Dec 2020 1:38 PM
రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ను టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ఇప్పుడేం కొత్తగా కలవలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక సందర్భాల్లో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలిశారు. ఆ సందర్భంగా రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, రాష్ర్టానికి సంబంధించిన ప్రాజెక్టులకు జాతీయ హోదా వంటి అంశాలపై చర్చించారని గుర్తు చేశారు.
ఇటీవల జరిగిన పర్యటన కూడా రాష్ర్టానికి సంబంధించిన సమస్యలపైనే అని బాల్క సుమన్ స్పష్టం చేశారు. రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు అనేకం ఉంటాయి.. వాటిలో భాగంగానే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని తెలిపారు.