దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ పై గట్టి పోటీనిచ్చిన టీఆర్ఎస్
By: chandrasekar Wed, 11 Nov 2020 09:39 AM
ఉప ఎన్నికల ఫలితాలపై
ధీమాతో వున్న టీఆర్ఎస్ ఓటమి పాలైనప్పటికీ ఫలితాల్లో బీజేపీ కి గట్టి
పోటీనిచ్చింది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ గట్టి
పోటీనిచ్చింది. ఉత్కంఠగా సాగిన పోరులో స్వల్ప మెజార్టీతోనే భారతీయ జనతా
పార్టీ విజయం సాధించింది. కేవలం 1,068 ఓట్లతో బీజేపీ గట్టెక్కింది.
ఈ ఎన్నికల్లో పోస్టల్
బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ పార్టీకి 720 ఓట్లు పోల్ అయ్యాయి. బీజేపీకి 368, కాంగ్రెస్
పార్టీకి 142 ఓట్లు పోలయ్యాయి. ఇక ఈవీఎం ఓట్ల లెక్కింపులో మొదటి
రౌండ్ నుంచి వరుసగా ఐదు రౌండ్ల వరకు బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. ఆరో
రౌండ్ నుంచి టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ దిశగా దూసుకెళ్లింది. ఆరో రౌండ్లో 353
మెజార్టీని టీఆర్ఎస్ పార్టీ సాధించింది.
ఓట్ల లెక్కింపు
సమయంలో వరుసగా 7, 10, 13, 14, 15, 16, 17, 18, 19 రౌండ్లలో ఆధిక్యం కనబరిచింది. 13, 14, 15, 16, 17, 18, 19 రౌండ్లలో సుమారు ఐదు వేల మెజార్టీని సాధించింది. 13వ
రౌండ్ నుంచి 19వ రౌండ్ వరకు టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని
ప్రదర్శించింది. చివరి రౌండ్ వరకు అందరిలోనూ ఈ ఫలితాలు ఉత్కంఠను
రేకెత్తించాయి. చివరకు బీజేపీ విజయాన్ని అందుకుంది.