Breaking News: మరో నేతను కోల్పోయిన తెరాస పార్టీ....!
By: Anji Sat, 05 Dec 2020 12:42 PM
తెరాస పార్టీ మరో నేతనుకోల్పోయింది. రీసెంట్ గా నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూయగా..శనివారం టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పరిగి ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎన్నికైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక పదవులు నిర్వహించారు.
కోట్ల విజయభాస్కర్రెడ్డి మంత్రివర్గంలో రాంరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. జలగం వెంకట్రావు, ఎన్ జనార్దన్రెడ్డి మంత్రివర్గాల్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు.
Tags :