Advertisement

  • బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన తెరాస పార్టీ

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన తెరాస పార్టీ

By: Sankar Fri, 20 Nov 2020 7:00 PM

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన తెరాస పార్టీ


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌పై టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఫిర్యాదులో ఎన్నికల సంఘాన్ని కోరారు. శుక్రవారం ఆయన ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌పై అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బండి సంజయ్ దేశద్రోహి అని అన్నారని పల్లా గుర్తు చేశారు. బండి సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు మీడియాతో చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకొని హైదరాబాద్‌కు ఏం చేశారో.. ఏం చేస్తారో చెప్పాలని బండి సంజయ్‌కు ఆయన హితవు పలికారు

Tags :
|
|

Advertisement