దుబ్బాకను అభివృద్ధి పథంలో నడిపిస్తాను ...సోలిపేట సుజాత
By: Sankar Fri, 16 Oct 2020 4:45 PM
దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాదిరిగానే దుబ్బాకను అభివృద్ధి చేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డి హామీ ఇచ్చారు. దుబ్బాక నియోజకవర్గంలో ఇవాళ ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సోలిపేట సుజాత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మీ ముందుకు వచ్చాను.. కారు గుర్తుకు ఓటేసి తనను ఆశీర్వదించాలని కోరారు. దుబ్బాకను సీఎం కేసీఆర్ సహకారంతో రామలింగారెడ్డి అభివృద్ధి చేశారు. మంత్రి హరీష్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అండదండలతో తాను అభివృద్ధి చేస్తానని సుజాత రెడ్డి స్పష్టం చేశారు.
దుబ్బాక అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు.. వాళ్లు గెలిచే అవకాశం లేదు. తనతో పాటు సుజాత ఇక్కడే ఉండి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఇప్పటికే తాగు, సాగు నీరు అందించామని తెలిపారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి సుజాతను భారీ మెజార్టీతో గెలిపించండి అని కొత్త ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.