నిజామాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘనవిజయం
By: chandrasekar Mon, 12 Oct 2020 5:57 PM
టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల
కవిత నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఉపఎన్నికలో
ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీలు ఆమెకు కనీసం పోటీకూడా ఇవ్వలేకపోయాయి.
మొత్తం 824 ఓట్లలో
823 ఓట్లు
పోలయ్యాయి. ఇందులో కవితకు 728 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్కు
29 ఓట్లు
వచ్చాయి. మొత్తం పది ఓట్లు చెల్లబాటు కాలేదు.
ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటి రౌండ్లో 600 ఓట్లకుగాను
టీఆర్ఎస్కు 542 ఓట్లు వచ్చాయి.
రెండో రౌండ్లో 221 ఓట్లకుగాను టీఆర్ఎస్కు 197, 17 బీజేపీకి, 7 కాంగ్రెస్పార్టీకి వచ్చాయి. ఇద్దరు ఓటర్లు పోస్టల్
బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారు. అక్టోబర్ 9న జరిగిన
ఈ ఎన్నికల్లో మొత్తం 823 మంది ప్రజాప్రతినిథులు తమ ఓటుహక్కు
వినియోగించుకున్నారు.