Advertisement

  • 105మంది అభ్యర్ధులతో జిహెచ్ఎంసి ఎన్నికలలో తొలి జాబితా విడుదల చేసిన తెరాస

105మంది అభ్యర్ధులతో జిహెచ్ఎంసి ఎన్నికలలో తొలి జాబితా విడుదల చేసిన తెరాస

By: Sankar Wed, 18 Nov 2020 9:53 PM

105మంది అభ్యర్ధులతో జిహెచ్ఎంసి ఎన్నికలలో తొలి జాబితా విడుదల చేసిన తెరాస


తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేసే పనిపై దృష్టి పెట్టాయి.

ఈ విషయంలో మిగతా పార్టీల కంటే టీఆర్ఎస్ అందరి కంటే ముందు నిలిచింది. తొలి విడుత 105 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించి అన్ని పార్టీలకు షాక్‌ ఇచ్చింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు కలిసొచ్చేలా 105 మందితో తొలి జాబితా రూపొందించారని సమాచారం.

2015లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 150 స్థానాలకుగానూ 99 సీట్లను గెలుచుకుంది. ఈ సారి 100కు పైగా స్థానాలను గెలుస్తామని అధినేత కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tags :
|

Advertisement