Advertisement

  • దుబ్బాక ఉపఎన్నికలో తెరాస ఓడిపోవడంతో అభిమాని ఆత్మహత్య

దుబ్బాక ఉపఎన్నికలో తెరాస ఓడిపోవడంతో అభిమాని ఆత్మహత్య

By: Sankar Wed, 11 Nov 2020 1:55 PM

దుబ్బాక ఉపఎన్నికలో తెరాస ఓడిపోవడంతో అభిమాని ఆత్మహత్య


దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్య విజయం సాధించింది. తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతపై ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ లో టీఆర్ఎస్ ఓడిపోవడాన్ని తట్టుకోలేని ఒక అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు..

టీఆర్ఎస్ ఓటమి పాలవడాన్ని తట్టుకోలేని ఆ అభిమాని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం లేచి చూడంగానే అక్కడున్నవారందరూ ఈ ఘటన చూసి షాక్ తిన్నారు. వివరాల్లోకెళ్తే.. అతడిని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం.. కొనాయిపల్లికి చెందిన స్వామిగా (34) గుర్తించారు.

మొదట్నుంచి టీఆర్ఎస్ అభిమానిగా.. మంత్రి హరీశ్ రావు, సీఎం కేసీఆర్ కు ఆయన వీరాభిమానిగా ఎక్కువ అభిమానం చూపించేవాడని కొందరు గ్రామస్థులు చెప్పుతున్నారు. కానీ దుబ్బాకలో ఫలితం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రావడంతో స్వామి తట్టుకోలేకపోయాడు. మంగళవారం అర్థరాత్రి గ్రామంలో ఉన్న వేపచెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు.

Tags :
|
|
|

Advertisement