Advertisement

  • సీఎం కుటుంబంలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ ..సెల్ఫ్‌ఐసోలేషన్‌లో సీఎం

సీఎం కుటుంబంలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ ..సెల్ఫ్‌ఐసోలేషన్‌లో సీఎం

By: Sankar Tue, 04 Aug 2020 12:44 PM

సీఎం కుటుంబంలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ ..సెల్ఫ్‌ఐసోలేషన్‌లో సీఎం



త్రిపుర ముఖ్యమంత్రి కుటుంబంలో కరోనా వైరస్ కలకలం రేపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ కుటుంబంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొవిడ్-19 సోకిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. సీఎం నివాసంలో కరోనా కలకలంపై విప్లవ్‌ ట్విటర్లో స్పందించారు.

'మా కుటుంబంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగతా వారికి నెగెటివ్‌ వచ్చింది. నేను కూడా కోవిడ్‌-19 పరీక్ష చేయించుకున్నా. ఫలితం కోసం వేచి చూస్తున్నా. నా నివాసంలోనే సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లాను. అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నా. కుటుంబసభ్యులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని' దేవ్‌ ట్వీట్‌ చేశాడు.

త్రిపురలో ప్రస్తుతం 1,700 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి 4,400 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడి 27 మంది మృతి చెందారు.

Tags :
|
|
|

Advertisement