టిక్ టాక్ నిషేధంపై విమర్శలు గుప్పించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ
By: Sankar Wed, 01 July 2020 6:04 PM
చైనా కు చెందిన యాప్స్ ను నిషేధించడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు మోడీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు గాల్వాన్ లోయలో జరిగిన ఇండియా చైనా సంఘర్షణలో మన సైనికులు 20 మంది మరణించడంతో చైనా వస్తువులను యాప్స్ ను బ్యాన్ చేయాలనీ దేశవ్యాప్తంగా డిమాండ్ చేసారు..అయితే నిషేధం విధించిన వాటిలో టిక్ టాక్ కూడా ఉండటంతో కొందరు ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు..
తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మాత్రం తీవ్రంగా మండిపడ్డారు. ఆమె బుధవారం కోల్కతాలోని ఇస్కాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టిక్టాక్ ఒక వినోదకరమైన యాప్ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం టాక్టాన్పై విధించిన నిషేధం ఒక హఠాత్తు పరిణామం అని మండిపడ్డారు.
ఈ నిషేధం వెనక ఉన్న వ్యూహాత్మక ప్రణాళిక ఏంటని నుస్రత్ జహాన్ సూటిగా ప్రశ్నించారు. మూకుమ్మడిగా చైనా కంపెనీలకు చెందిన యాప్స్ను నిషేధించడం వల్ల దేశంలోని యువత నిరుద్యోగులుగా మారితే పరిస్థితి ఎంటో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో విధించిన పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఎంతో నష్టపోయారని విమర్శించారు.
ఇప్పడు టిక్టాక్ను నిషేధించటం వల్ల కూడా అంతే స్థాయిలో ప్రజలు నష్టపోతారని నుస్రత్ జహాన్ దుయ్యబట్టారు. ఇక టిక్టాక్ సీఈఓ భారతదేశంలోని తమ ఉద్యోగులకు లేఖ రాస్తూ.. టిక్టాక్ సంస్థ ఉద్యోగులు గర్వించదగిన సానుకూల అనుభవాలు, అవకాశాలను పునరుద్ధరించడానికి తమ శక్తి మేరకు పని చేస్తామని తెలిపిన విషయం తెలిసిందే.