58 సార్లు రక్తదానం చేసిన ప్రవీణ్కుమార్ కు ఘనసన్మానం...
By: chandrasekar Wed, 02 Dec 2020 5:04 PM
కొండూరు ప్రవీణ్కుమార్ 58
సార్లు రక్తదానం చేసారు. రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ ఖాజాకుతుబుద్దీన్ ఆయనను
సన్మానించారు. మంగళవారం జిల్లా రెడ్క్రాస్ రక్తనిధి కేంద్రంలో ప్రవీణ్కుమార్
రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా రెడ్క్రాస్
జిల్లా చైర్మన్ మాట్లాడుతూ మూడు నెలలకు ఒక్కసారి రక్తదానం చేస్తున్న ప్రవీణ్కుమార్
సేవలు వెలకట్టలేనిదన్నారు. వీరితోపాటు యాదగిరి, బచ్చు భరత్కుమార్ రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు.
అనంతరం 58వ సారి
రక్తదానం చేసిన ప్రవీణ్కమార్ను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్
మాట్లాడుతూ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని క్రమం తప్పకుండా రక్తదానం
చేస్తున్నట్లు, ప్రతి
సంవత్సరం నాలుగు పర్యాయాలు రక్తదానం చేస్తానని అన్నారు. కార్యక్రమంలో రెడ్క్రాస్
జిల్లా పాలకమండలి సభ్యురాలు చెన్నమ్మథామస్, టెక్నీషియన్లు లక్ష్మీపతి, వహీద్, మహమూద్, పాషా, శ్రీలక్ష్మి
పాల్గొన్నారు.