మహిళల టీ20 ఛాలెంజ్ లో విజేతగా ట్రయల్ బ్లేజర్స్
By: chandrasekar Tue, 10 Nov 2020 09:54 AM
ఈ సారి కరోనా కారణంగా
మహిళల టీ20
మ్యాచ్ యూఏఈ లో నిర్వహించారు. ఇందులో టైటిల్ విజేతగా ఈ సారి ట్రయల్ బ్లేజర్స్ నిలిచారు. మహిళల టీ20
ఛాలెంజ్2020 సీజన్
విజేతగా స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్ బ్లేజర్స్ నిలిచింది. సోమవారం
డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్ నోవాస్తో జరిగిన టైటిల్ పోరులో బ్లేజర్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. 119
పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో నోవాస్ బాటింగ్ లో తడబడ్డారు. ఛేదనలో హర్మన్ప్రీత్
కౌర్(30) మాత్రమే
పోరాడటంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 102 పరుగులే చేసింది. ఛేదనలో నోవాస్ బ్యాట్స్వుమెన్ను
బ్లేజర్స్ బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు. అందువల్ల పరుగులు రాబట్టలేక
పోయారు.
అంతకుముందు ట్రయల్
బ్లేజర్స్ జట్టులో మంధాన (68:
49 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) అద్భుత అర్ధశతకంతో రాణించడంతో 20
ఓవర్లలో 8
వికెట్లకు 118 పరుగులు చేసింది. పవర్ప్లేలో పరుగులిచ్చినా తర్వాత
గట్టిగా పుంజుకున్న సూపర్ నోవాస్ బౌలర్లు ప్రత్యర్థిని బాగా కట్టడి చేశారు.
పూనమ్ యాదవ్, సిరివర్దనే చెరో వికెట్ పడగొట్టారు. మెరుపు ఆరంభం
లభించినా తరువాత వచ్చిన వారు బాటింగ్ లో చేతులెత్తేయడంతో భారీ స్కోరు
చేసే అవకాశాన్ని బ్లేజర్స్ కోల్పోయింది.
డాటిన్ (20), రిచా ఘోష్ (10)
మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. దీప్తి శర్మ (9), హర్లీన్
డియో (4), సోఫీ
ఎక్లిస్టోన్ (1) నిరాశపరిచారు. ట్రయల్ బ్లేజర్స్ జట్టులో మంధాన, డాటిన్
ఓపెనింగ్ జోడీ తొలి వికెట్కు 71 పరుగులు జోడించింది.