ఏలూరులోకి వస్తున్న వాహనాలను నియంత్రిస్తున్న ట్రాన్స్ జెండర్స్
By: chandrasekar Tue, 14 July 2020 12:01 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలైనన్ని చర్యలు చేపడుతోంది. కరోనా
కట్టడికి ఏపీ పోలీసు శాఖ కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో
కరోనా పాజిటివ్ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో మళ్లీ లాక్
డౌన్ అమలు చేస్తున్నారు.
ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా
భారీగా కరోనా కేసులు నమోదవుతున్నా జనాలు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ
యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఈ తరుణంలో ప్రజలకు కరోనా నిబంధనల అవగాహన
కల్పించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీసుల వినూత్న ప్రయోగం చేశారు.
ఏలూరులో కరోనా కట్టడికి
ట్రాన్స్ జెండర్స్ను రంగంలోకి దించారు. ప్రజలకు మేలు చేసేది కావడంతో వారు సైతం
స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. నిర్ణీత సమయం దాటినా ఏలూరులోకి వస్తున్న వాహనాలను
ట్రాన్స్ జెండర్స్ నియంత్రిస్తున్నారు. అలాగే ఆశ్రం జంక్షన్ వద్ద ఏలూరు రూరల్
పోలీసుల ఆధ్వర్యంలో కరోనా ఆంక్షలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
వాహనదారులకు చేతులు ఎత్తి
మొక్కుతూ వాహనదారులకు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. మొత్తానికి ప్రజలతో ట్రాన్స్
జెండర్లు వ్యవహరిస్తున్న తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.
ఏపీలో కరోనా వైరస్ డేంజర్
బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సోమవారం
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో మరోసారి
రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి.
అలాగే రికార్డు స్థాయిలో
మరణాలు సంభవించాయి. ఒకే రోజు ఏకంగా 37 మంది మృతి చెందారు. గత 24
గంటల్లో 19,247 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 1,919 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి
వచ్చిన వారికి 13 మందికి, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా వైరస్
సోకింది. దీంతో ఒక్క రోజే మొత్తం కేసులు 1935కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 31,103కు చేరాయి.