తెలుగు రాష్ట్రాలలో రైళ్ల సమయం మారాయి...
By: chandrasekar Mon, 30 Nov 2020 1:57 PM
తెలుగు రాష్ట్రాలలో రైళ్ల
సమయం మారాయి. విశాఖ నుంచి, విశాఖ మీదుగా రాకపోకలు సాగించే చాలా రైళ్ల సమయాల్ని
మార్పులు చేశారు. డిసెంబరు 1 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు అధికారులు
పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న వాటికి సంబంధించిన వివరాలు
ప్రకటించారు. న్యూ ఢిల్లీ నుంచి విశాఖ వచ్చే ఏపీ ఎక్స్ప్రెస్ రైలు వేగాన్ని
పెంచారు.. అందుకే ఆ రైలు 45 నిమిషాల ముందే విశాఖకు చేరేలా ప్రణాళిక
వేస్తున్నారు. ఇదే మార్గంలో నడిచే స్వర్ణజయంతి స్పెషల్ రైలును కూడా విశాఖకు 2.40 గంటలు
ముందుకు మార్చారు. విశాఖ నుంచి కోర్బాకు గంట ఆలస్యంగా విశాఖలో బయలుదేరి.. కోర్బా
నుంచి విశాఖకు 40 నిమిషాలు ముందే వచ్చేలా మార్పులు జరిగాయి. ఈ రూటులో
పెండింగ్లో ఉన్న భాగాన్ని పూర్తిస్థాయిలో విద్యుదీకరించడంతో రైలు వేగాన్ని కూడా
పెంచుతున్నారు.
విశాఖ - విజయవాడ రత్నాచల్
స్పెషల్ రైలును 1 నుంచి మారిన సమయాలతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
విశాఖ మీదుగా వెళ్లే భువనేశ్వర్-బెంగళూరు ప్రశాంతి స్పెషల్ రైలుకూ సమయాల్ని
మార్చినట్లు చెబుతున్నారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
బెంగళూరు-భువనేశ్వర్ రూట్లో విశాఖకు ఇదివరకు 1.15కు రావాల్సి ఉండగా దీన్ని
11.15కే
వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డిసెంబరు 1 నుంచి రైళ్ల సమయాల్ని
మార్పు చేస్తున్నప్పటికీ తూర్పు కోస్తా అధికారులు అధికారికంగా ప్రకటన చేయలేదు.
దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. టికెట్లు తీసుకున్న
ప్రయాణికులు తమ రైళ్ల సమయాల్ని సరిచూసుకుని మరీ బయలుదేరాలని అధికారులు
సూచిస్తున్నారు.