Advertisement

  • చెలరేగిన స్మ్రితి మందాన ...ఫైనల్లో హర్మాన్ సేన చిత్తు

చెలరేగిన స్మ్రితి మందాన ...ఫైనల్లో హర్మాన్ సేన చిత్తు

By: Sankar Tue, 10 Nov 2020 07:26 AM

చెలరేగిన స్మ్రితి మందాన ...ఫైనల్లో హర్మాన్ సేన చిత్తు


షార్జా వేదికగా నిన్న జరిగిన మహిళల టీ 20 ఛాలెంజ్ ఫైనల్స్ లో స్మృతి మందాన న్యాయకత్వం వహిస్తున్న ట్రయల్‌ బ్లేజర్స్‌ విజయం సాధించింది. ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సూపర్‌నోవాస్‌ తో తలపడిన మందాన జట్టు మొదటిసారి ఉమెన్స్ ఐపీఎల్ టైటిల్ అందుకుంది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ట్రయల్‌ బ్లేజర్స్‌ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అందులో కెప్టెన్ స్మృతి 49 బంతుల్లో 68 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించింది. ఆ తర్వాత 119 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించడంలో సూపర్‌నోవాస్‌ తడబడింది. ఇక్కడ కూడా కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ 30 పరుగులు చేసిన తనకు తోడుగా ఎవరు నిలబడకపోవడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 102 పరుగులు మాత్రమే చేసింది.

దాంతో ఈ ఏడాది టైటిల్ అందుకొని హ్యాట్రిక్ కొట్టాలన్న తమ ఆశను నెరవేర్చుకోలేకపోయింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో అర్ధశతకం చేసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రయల్‌ బ్లేజర్స్‌ కెప్టెన్ స్మృతి మందాన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవగా... రాధా యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకుంది.

Tags :
|
|
|

Advertisement