తూర్పు గోదావరిలో విషాదం...ఈతకెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి
By: chandrasekar Mon, 21 Sept 2020 09:52 AM
తూర్పు గోదావరి జిల్లాలో
విషాద ఘటన చోటుచేసుకుంది. ఈత సరదా రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈత
కొడదామని చెరువులో దిగిన ఇద్దరు చిన్నారులు నీటమునిగి మృత్యువాతపడ్డారు.
నీటమునిగి ప్రాణాలు
కోల్పోయారు. ఈ దుర్ఘటన జిల్లాలోని ఎటపాక మండలం పాలమడుగులో జరిగింది. గ్రామానికి
చెందిన మహేష్(11), సాయికిరణ్(12)
చెరువుతో ఈత కొట్టేందుకు స్నేహితులతో కలసి వెళ్లారు.
ప్రమాదవశాత్తూ నీటమునిగి మృత్యువాతపడ్డారు.
సమాచారం అందుకున్న
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. మృతదేహాలను
పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు
చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Tags :
tragedy |
kills |
in east |