Advertisement

  • కామారెడ్డి పట్టణంలో విషాదం భార్యాభర్తలు కరోనాతో మృతి

కామారెడ్డి పట్టణంలో విషాదం భార్యాభర్తలు కరోనాతో మృతి

By: chandrasekar Fri, 14 Aug 2020 8:21 PM

కామారెడ్డి పట్టణంలో విషాదం భార్యాభర్తలు కరోనాతో మృతి


కరోనా చాలా వేగంగా ప్రబలడంతో చాలా మంది దీని బారిన పడుతున్నారు. కుటుంబంలోని భార్య మరియు భర్తకు కరోనా సోకింది. కామారెడ్డి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. పంచముఖ హనుమాన్‌ కాలనీలో వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలు కరోనా బారినపడి మృతి చెందారు. కరోనా లక్షణాలతో హోం క్వారంటెన్‌లో ఉన్న రాజేష్(35) అనే యువకుడు బాత్ రూమ్‌లో జారిపడి ఈ నెల 7న మృతి చెందాడు. కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని భార్య కూడా గురువారం మృతి చెందింది. మరో వైపు మృతుడి కుమార్తె, తల్లిదండ్రులకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. కొడుకు నుండి వీళ్లకు కూడా వ్యాపించు ఉంటుందని తెలుస్తుంది.

రాజేష్ మృత దేహానికి అంత్యక్రియలకు హాజరైన 6 మందికి కూడా కరోనా సోకినట్లు వైద్యపరీక్షల్లో వెల్లడైంది. దీంతో రాజేష్ అంత్యక్రియలకు హాజరైన మిగిలిన బంధువులు, స్నేహితుల్లో ఆందోళన మొదలైంది. అతని అంత్యక్రియలకు హాజరైన వారికి వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు చేస్తున్నారు. వీరి యొక్క టెస్ట్ వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. అయితే కామారెడ్డిలో గతంలో కూడా ఓ వ్యాపారి ఇచ్చిన విందు ద్వారా ఐదుగురికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రజలందరూ సంగీక దూరాన్ని పాటిస్తూ ముఖానికి మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు తీసికోవలసిందిగా అధికారులు సూచనలు చేస్తున్నారు.

Tags :
|

Advertisement