గుంటూరు జిల్లాలో విషాదం...బంతాట ముగ్గురి ప్రాణాలను బలిగొంది.
By: chandrasekar Fri, 24 July 2020 3:16 PM
నీటికుంటలో పడిన బంతి
కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ ముగ్గురు టీనేజర్లు మృత్యువాతపడిన విషాద ఘటన గుంటూరు
జిల్లాలో చోటుచేసుకుంది. బంతాట ముగ్గురి ప్రాణాలను బలిగొంది.
గుంటూరు జిల్లాలోని
కాకుమానుకి చెందిన కాండ్రు పవన్(15),
అరి రాకేష్(17),
జి.కిరణ్(15)
స్నేహితులతో కలసి ఊరి చివర పొలాల్లో ఏడు పెంకులాట
ఆడుకునేందుకు వెళ్లారు. స్నేహితుడు విసిరిన బంతి నీటి కుంటలో పడిపోవడంతో తీసేందుకు
ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఆ ప్రయత్నంలో ఒకరి వెంట
మరొకరు ముగ్గురు నీటి కుంటలో పడిపోయారు. నీటిలో మునిగిపోవడంతో ఊపిరాడక ఇద్దరు
అక్కడికక్కడే మృతి చెందారు. పవన్, రాకేష్ స్పాట్లోనే చనిపోగా కిరణ్ను ఆస్పత్రికి
తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు.
చనిపోయిన ముగ్గురు ఒకే
వీధికి చెందిన వారు కావడంతో రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి
వివరాలు తెలియాల్సి ఉంది. ఒకేసారి ముగ్గురు బాలురు మరణించడంతో గ్రామంలో విషాదచాయలు
అలుముకున్నాయి.