Advertisement

అదృశ్యమైన బాలిక మృత‌దేహ‌మై తేలడంతో విషాదం

By: chandrasekar Fri, 18 Sept 2020 8:48 PM

అదృశ్యమైన బాలిక మృత‌దేహ‌మై తేలడంతో విషాదం


అదృశ్యమైన బాలిక మృత‌దేహ‌మై తేలడంతో విషాదం నెలకొంది. నేరెడ్‌మెట్‌లో నిన్న సాయంత్రం బాలిక అదృశ్య‌మైన ఘ‌ట‌న విషాదాంతంగా మారింది. ప్ర‌మాద‌వ‌శాత్తు కాలువలో ప‌డిన పోయిన బాలిక సుమేధ‌(12) స్థానికంగా ఉన్న బండ‌చెరువులో మృత‌దేహ‌మై తేలింది.

బాలిక మరణంపై తొలుత వివరాలు అందలేదు. బాలిక మ‌ర‌ణ‌వార్త విన్న త‌ల్లిదండ్రులు బోరున విల‌పిస్తున్నారు. సుమేధ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రి మార్చురికీ త‌ర‌లించారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి సైకిల్‌పై బ‌య‌ట‌కు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు.

ఆమె ఆచూకీ కోసం అన్నీ ప్రాంతాల్లో గాలించిన త‌ల్లిదండ్రుల‌కు నిరాశే ఎదురైంది. సైకిల్‌పై నుంచి ప్ర‌మాద‌వ‌శాత్తు నాలాలో ప‌డిపోయి ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. నిన్న కురిసిన వ‌ర్షానికి నేరెడ్‌మెట్‌లో నాలాలు పొంగి పొర్లాయి. నీళ్లు అధికంగా ప్రవహించడంతో మునిగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Tags :
|

Advertisement