Advertisement

విషాదం: మొబైల్ గేమ్‌కు బానిసై ఓ యువకుడు మృతి

By: chandrasekar Tue, 17 Nov 2020 11:29 AM

విషాదం: మొబైల్ గేమ్‌కు బానిసై ఓ యువకుడు మృతి


కామారెడ్డి పట్టణంలో మొబైల్ గేమ్‌కు బానిసై ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. సాయికృష్ణ అనే 22 ఏళ్ల యువకుడికి తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ తన ఇంట్లో ఉంచుకొని ఆలనా పాలనా చూస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో వారు నివాసం ఉంటున్నారు.

అయితే.. ఆ యువకుడు కొంత కాలంగా తన మొబైల్ ఫోన్లో పబ్జీ తరహా వీడియో గేమ్ (చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో పబ్జీ యాప్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది) ఆడుతున్నట్లు బంధువులు తెలిపారు. ఇదే క్రమంలో సోమవారం (నవంబర్ 16) ఉదయం నుంచి అదే పనిగా వీడియో గేమ్ ఆడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

అపస్మారకస్థితిలో ఉన్న సాయికృష్ణను గుర్తించిన బంధువులు వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గుండెపోటుకు గురై మరణించినట్లు బంధువులు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :
|

Advertisement