- హోమ్›
- వార్తలు›
- ఢిల్లీలోని పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ జామ్... దీపావళికి ఊర్లకు బయలుదేరిన ప్రయాణికులు...
ఢిల్లీలోని పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ జామ్... దీపావళికి ఊర్లకు బయలుదేరిన ప్రయాణికులు...
By: chandrasekar Fri, 13 Nov 2020 10:54 AM
దేశంలో దీపావళి సంబరాలు
మొదలవ్వడంతో అందరూ తమ తమ సొంత ఊర్లకు బయలుదేరారు. దీపావళి నేపథ్యంలో నగరవాసులు
సొంత ఊర్లకు ప్రయాణమవుతున్నారు. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ రద్దీ
బాగా పెరగింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ జామ్
ఏర్పడింది.
ఇందువల్ల రహదారులపై వేల
సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు
ప్రయత్నిస్తున్నారు. దేశ రాజధాని ప్రాంతానికి నలువైపులా పలు రాష్ట్రాలు ఉండటంతో
ఉద్యోగ, వ్యాపార
రిత్యా ఢిల్లీలో ఉండేవారంతా దీపావళికి సొంత ఊర్లకు ప్రయాణమవుతున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో
మరోసారి కరోనా విజృంభించడం కూడా దీనికి కారణంగా కనిపిస్తున్నది. మరోవైపు వరుస
వారాంతర సెలవులు, పండుగ షాపింగ్ వల్ల కూడా ఢిల్లీలో ట్రాఫిక్ రద్దీ
బాగా పెరిగింది. కుటుంబంతో కలసి పండుగ జరుపుకోవడానికి అందరూ బయలుదేరడంతో ట్రాఫిక్
జామ్ ఏర్పడిందని తెలుస్తుంది.