Advertisement

  • విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ ఆంక్షలు...

విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ ఆంక్షలు...

By: Sankar Fri, 30 Oct 2020 12:18 PM

విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ ఆంక్షలు...


విజయవాడ వాసులకు అలర్ట్.. కనదుర్గ ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ మళ్లించారు.. ఆంక్షలు విధించారు. సీపీ ఆదేశాలతో ప్లై ఓవర్ బ్రిడ్జ్‌పై భారీ వాహనాలు ,లారీలు, నిషేధించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దారి మళ్లించారు.

శుక్రవారం ఉదయం నుంచి భవానీపురం సెక్టార్ ట్రాఫిక్ పోలీసులు భారీ వాహనాలు, టిప్పర్లు లారీలు కంటెయినర్లు, ఇతర వాహనాలు భవానీపురం స్వాతి సెంటర్ నుంచి గొల్లపూడి బైపాస్ రోడ్డు వైపు చర్చ్ సెంటర్ వైపుగా మళ్లించారు. ఇక నుంచి ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దుర్గ బ్రిడ్జ్‌పై వాహనాలు నిషేధం కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చిన్నకార్లు, ఆర్టీసీ బస్సులు, అంబులెన్స్, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే సిలెండర్ల వాహనాలు, ఆటోలు,ద్విచక్ర వాహనాల రాకపోకలకు యధాతథంగా కొనసాగుతాయి. ప్రైవేటు బస్సులు స్వాతి సెంటర్ మీదుగా కొండ తిరిగి రావాల్సిందే.. రాత్రి వేళ 11 గంటల తర్వాత లారీలు, భారీ వాహనాలు అనుమతిస్తారు. వాహనాల యజమానులపై నిబంధనలు పాటించి సహకరించాలని భవానీపురం సెక్టార్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.

Tags :

Advertisement