Advertisement

  • కరోనా వైరస్ పై అప్రమత్తంగా ఉండండి ..ప్రజలకు సూచించిన పద్మారావుగౌడ్‌

కరోనా వైరస్ పై అప్రమత్తంగా ఉండండి ..ప్రజలకు సూచించిన పద్మారావుగౌడ్‌

By: Sankar Thu, 02 July 2020 4:12 PM

కరోనా వైరస్ పై అప్రమత్తంగా ఉండండి ..ప్రజలకు సూచించిన పద్మారావుగౌడ్‌



తెలంగాణ రాజకీయ నాయకులూ ఒక్కరుగా కరోనా మహమ్మారి బారిన పడ్తున్నారు ..ముఖ్యంగా తెరాస నాయకులూ ఎక్కువగా దీని ప్రభావానికి గురి అవుతున్నారు ..ఇలా కరోనాకు గురి అయినా వారిలో ఒకరైన శాసన సభ డిప్యూటీ స్పీకర్ తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు ..కరోనా కారణంగా కొద్ది రోజులు హోమ్‌ క్వారెంటైన్‌కు పరిమితం కావలసి వచ్చిందన్నారు. కరోనాకు సంబంధించి తనకు ఎలాంటి లక్షణాలు బయట పడలేదని... పరీక్షల్లో మాత్రమే తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. దీంతో ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులకు దూరంగా ఉండాల్సి రావడం కొంత ఇబ్బంది అయినా తప్పడం లేదన్నారు..

ప్రజలెవరూ తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కుదుట పడేవరకూ మా నివాసానికి రాకుండా ఉండాలని పద్మారావుగౌడ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. తప్పని సరి అయితే తప్ప బయటకు రావద్దన్నారు. నా ఆరాధ్యదైవం కొమురవెల్లి మల్లన్న... అమ్మవారి ఆశీస్సులతో త్వరగా పరిపూర్ణ ఆరోగ్య వంతుడిగా ప్రజల మధ్యకు వస్తానన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో వారి సలహాలు, సూచనలతో హోం క్వారంటైన్‌లో ఆత్మవిశ్వాసంతో గడుపుతున్నానని, కరోనాకు మందుకన్నా మనోధైర్యం ఎంతో మేలు చేస్తుందన్నారు.

అయితే హైద్రాబాద్లో కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో ఉంది ..గత కొద్దీ కాలంగా అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి ..రాజకీయ నాయకులు , సెలబ్రిటీస్ కూడా కరోనా మహమ్మారి బారిన పడుతుండటంతో సామాన్య ప్రజలు భయంతో వణికిపోతున్నారు ..

Tags :
|
|

Advertisement