జిహెచ్ఎంసి ఎన్నికలు ..అన్ని స్థానాలలో బరిలోకి దిగుతున్న తెరాస
By: Sankar Mon, 23 Nov 2020 11:13 PM
గ్రేటర్ హైదరాబాద్లో పోరు రసవత్తరంగా సాగుతోంది. నిన్నటి వరకు అన్ని పార్టీ ఆఫీసుల ముందు బీ ఫార్మ్ల కోసం కుస్తీ పట్టిన నేతలకు.. ఆ అవకాశాలు కూడా ముగిసాయి. తాజాగా గ్రేటర్లో 150 వార్డుల్లో మొత్తం 1,122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ తెలిపారు
ఎన్నికలు జరుగుతున్న అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ మాత్రమే పోటీ చేస్తోందని ప్రకటించారు.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ తెలిపారు. గ్రేటర్లోని మొత్తం 150 స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీగా టీఆర్ఎస్ పార్టీ నిలిచింది.
ఎన్నికలు జరుగుతున్న అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను పోటీకి నిలిపింది. నవాబ్సాహెబ్ కుంట డివిజన్లో తప్ప 149 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను బరిలో దించింది. కాంగ్రెస్ 146 స్థానాలు, ఎంఐఎం 51 స్థానాలు, టీడీపీ 106 స్థానాలు, సీపీఐ 17 స్థానాలు, సీపీఎం 12 డివిజన్లలో అభ్యర్థులు రంగంలోకి దింపింది.