ప్రియాంక చోప్రా, అనురాగ్ కశ్యప్ ను రాయబారిగా ఆహ్వానించిన టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్
By: chandrasekar Thu, 09 July 2020 5:37 PM
ప్రముఖ నటి ప్రియాంక
చోప్రాకు టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి రాయబారిగా ఆహ్వానం అందింది. ఈమెతోపాటు బాలీవుడ్ నుంచి
నిర్మాత అనురాగ్ కశ్యప్ కు కూడా రాయబారిగా ఉండాలంటూ టొరంటో అంతర్జాతీయ చలన
చిత్రోత్సవం నిర్వాహకులు ఆహ్వానం పంపారు. సెప్టెంబర్ 10 నుంచి
19 వరకు 45 వ
టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ జరుగనున్నది.
"నా కెరీర్ మొత్తంలో ఐఎఫ్టీఐఎఫ్ఎఫ్-ఎన్ఈటీ రెండవ
నివాసంగా ఉన్నది. నటి, నిర్మాతగా ఈ చిత్రోత్సవంతో నాకెంతో అనుబంధం
ఉన్నది" అని ప్రియాంక టీఐఎఫ్ఎఫ్ తో తన ప్రయాణ క్షణాలతో ఒక వీడియోను ట్వీట్
చేసింది.
ఈ ఏడాది కూడా రాయబారిగా
తనను ఆహ్వానించినందుకు చాలా గర్వపడుతున్నానని, ఎంతో విలువైన సంబంధాన్ని కొనసాగించాలని
ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ప్రియాంక చోప్రా, అనురాగ్ కశ్యప్ తోపాటు అవాడువెర్నే, డారెన్
అరోనోఫ్స్కీ, తైకా వెయిటిటి, నికోల్ కిడ్మాన్, మార్టిన్ స్కోర్సెస్, నాడిన్ లబాకి, అల్ఫోన్సో
క్యూరాన్, టాంటూ
కార్డినల్, రిజ్ అహ్మద్, రియాన్ జాన్సన్, జాసన్ రీట్మాన్, ఇసాబెల్లె హప్పర్ట్, క్లైర్ డెనిస్, అటామ్
మోర్గై, విగో , డేవిడ్
ఓయెలోవో, లులు
వాంగ్, రోసముండ్
పైక్, సారా
గాడోన్ మరియు డెనిస్ విల్లెనెయువ్ కూడా రాయబారులుగా ఉండేందుకు అంగీకరించారు.
కోవిద్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఉత్సవాల్లో భౌతిక
ప్రదర్శనలు, డ్రైవ్-ఇన్లు, డిజిటల్ స్క్రీనింగ్లు, వర్చువల్
రెడ్ తివాచీ ప్రదర్శనతోపాటు మీడియా సమావేశాలను పకడ్బందీగా నిర్వహించేందుకు
నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.