కేంద్ర పాలిత ప్రాంతం యానాం లో టోర్నడో
By: chandrasekar Sat, 18 July 2020 8:40 PM
అమెరికాలో నిత్యం ఎక్కడో
ఓ చోట టోర్నడోలు సుడులు తిరుగుతూ విధ్వంసం సృష్టించే విషయం తెలిసిందే. ఆ స్థాయిలో
కాకపోయినా భారత్ లో ఇటీవలి కాలంలో టోర్నడోలు తరచూ
ఏర్పడుతున్నాయి.
ఇప్పుడు యానాం ప్రాంతంలో
టోర్నడో దృశ్యం దర్శనమిచ్చింది. ఇక్కడి అయ్యనార్ నగర్ లో ఉన్న ఓ రొయ్యల చెరువులోని
నీరు అకస్మాత్తుగా ఆకాశానికెగసింది. వేగంగా సుడులు తిరుగుతూ మేఘాల్లోకి నీరు
వెళ్లడాన్ని స్థానికులు విస్మయంతో తిలకించారు.ఈ ప్రాంతంలో టోర్నడోలు గతంలో ఎప్పుడూ
ఏర్పడకపోవడంతో చాలామంది తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు.
అయితే వాతావరణలో
మార్పుల కారణంగా ఈ టోర్నడోలు ఏర్పడుతుంటాయని, అయితే యానాం ప్రాంతంలో మాత్రం గతంలో ఎప్పుడూ
టోర్నడోలు కనిపించిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు.
Tags :
tornado |
in union |
of yanam |