భారత్ బంద్ నేపథ్యంలో రేపు జరగాల్సిన పాలిటెక్నీక్ పరీక్ష వాయిదా
By: Sankar Mon, 07 Dec 2020 9:19 PM
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. రేపు జరుగాల్సిన పాలిటెక్నిక్ పరీక్షలు వాయిదాపడ్డాయి.
రేపటి పరీక్షలను ఈ నెల 23న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నెల 9 నుంచి జరిగే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. భారత్ బంద్ కారణంగా పాలిటెక్నిక్ పరీక్షలేగాక ఓయూ, జేఎన్టీయూ యూనివర్సిటీల పరిధిలో కూడా రేపు జరుగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి.
కాగా రేపటి బంద్ కు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే...రేపు తెరాస ముఖ్య నేతలు అంత బంద్ లో పాల్గొని బీజేపీ ప్రభుత్వ తీరుకు తమ నిరసనను వ్యక్తపరచనున్నారు...
Tags :
tomorrow |
exam |