Advertisement

దుబ్బాక ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి

By: Sankar Mon, 02 Nov 2020 10:56 AM

దుబ్బాక ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి


దుబ్బాక ఉప ఎన్నికకు కౌంట్ డౌన్‌ మొదలైంది. రేపే దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరుగునుంది. ఈ ఉప ఎన్నికలో 1,98,807 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఇందులో 98028 మంది పురుషులు, 100719 మహిళలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే..ఈ ఉప ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నిక నిర్వాహణకు 5,000 సిబ్బందిని నియామకం చేశారు అధికారులు. అలాగే 315 బూత్ లు, 89 సమస్యాత్మక కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.

కోవిడ్ నిబంధనలతో ఈ పోలింగ్ జరగనుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు అధికారులు చేసారు. దుబ్బాక పోరులో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో ఇరవై మంది బరిలో ఉన్నారు. కాగా...రేపు దుబ్బాకలో పోలింగ్‌ జరగనుండగా.. 10న ఫలితం వెల్లడికానుంది.

Tags :
|
|

Advertisement