అహ్మదాబాద్లో రేపు, ఎల్లుండి మెట్రో బంద్...
By: chandrasekar Sat, 21 Nov 2020 12:56 PM
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో
సంపూర్ణ కర్ఫ్యూ నేపథ్యంలో రేపు, ఎల్లుండి మెట్రో రైల్ సేవలు నిలిపివేయనున్నారు.
ఈ విషయాన్ని అహ్మదాబాద్
మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇటీవల కరోనా మహమ్మారి విజృంభిచండంతో
గుజరాత్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని పలు నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించింది.
అహ్మదాబాద్లో మాత్రం నవంబర్
20
రాత్రి 9 గంటల
నుంచి 23 ఉదయం
6 గంటల
వరకు కంప్లీట్ కర్ఫ్యూ విధించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ
ఆదేశాల మేరకు నగరంలో రేపు, ఎల్లుండి మెట్రోరైల్ సేవలను నిలిపివేస్తున్నట్లు
అహ్మదాబాద్ మెట్రో రైల్ కార్పోరేషన్ పేర్కొంది.
Tags :
tomorrow |
ellundi |
metro |