Advertisement

  • టామ్ మూడీ టి ట్వంటీ జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ ..

టామ్ మూడీ టి ట్వంటీ జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ ..

By: Sankar Sun, 12 July 2020 7:19 PM

టామ్ మూడీ టి ట్వంటీ జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ ..



ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ ప్రకటించిన వరల్డ్‌ టీ20 ఎలెవన్ జట్టుకి భారత ఓపెనర్ రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌కి హెడ్ కోచ్‌గా పనిచేసిన టామ్ మూడీని క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ప్రస్తుత తరం క్రికెటర్లతో ఒక వరల్డ్ టీ20 జట్టుని ప్రకటించమని కోరాడు. దాంతో.. టీమ్‌ని సెలెక్ట్ చేసిన టామ్ మూడీ.. రోహిత్ శర్మని ఓపెనర్‌గా ఎంపిక చేయడంతో పాటు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించాడు. ధోనీకి ఈ జట్టులో చోటు దక్కలేదు.

టామ్ మూడి తన జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ , డేవిడ్ వార్నర్ లకు స్థానం కల్పించాడు ..ఇక వన్ డౌన్ లో కింగ్ కోహ్లీకి స్థానం ఇచ్చిన మూడి , నాలుగవ స్థానంలో దిగ్గజ సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఎబిడి ని తీసుకున్నాడు ..అయితే వికెట్ కీపర్ గా ఆశ్చర్యకరంగా వెస్ట్ ఇండీస్ యువ ఆటగాడు నికోలస్ పూరాన్ కు అవకాశం ఇచ్చాడు ..

అల్ రౌండర్ స్థానంలో వెస్ట్ ఇండీస్ నుంచే రస్సెల్ ను తీసుకున్న మూడి..రషీద్ ఖాన్, సునీల్ నరైన్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లకి జట్టులో చోటిచ్చాడు. ఇక మిచెల్ స్టార్క్, జస్‌ప్రీత్ బుమ్రా, జోప్రా ఆర్చర్ రూపంలో ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసిన టామ్ మూడీ.. 12వ ఆటగాడిగా రవీంద్ర జడేజాని ఎంపిక చేశాడు. ఫీల్డింగ్ కోసమే జడేజాని అలా సెలక్ట్ చేసినట్లు మూడీ వివరించాడు.

Tags :
|

Advertisement