మంత్రి కేటీఆర్ ను కలిసిన యంగ్ హీరో రామ్ ..ఎందుకో తెలుసా !
By: Sankar Thu, 22 Oct 2020 2:54 PM
వరద బాధితులకు సాయం అందించాలన్న సీఎం కేసీఆర్ పిలుపుతో... ప్రముఖులంతా భారీగా స్పందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు... పారిశ్రామికవేత్తలు, సినీ తారలు విరాళం ప్రకటిస్తున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ప్రముఖులంతా ముందుకు రావాలన్న సీఎం కేసీఆర్ పిలుపుతో... చాలా మంది స్పందిస్తున్నారు. కోట్ల రూపాయల విరాళం ప్రకటించి పెద్దమనసు చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా వరద భాదితుల సహాయార్థం యువ కథానాయకుడు రామ్ పోతినేని తన వంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందజేశారు.
ఈ మేరకు హైదరాబాద్ లోని మాంటెయ్ కేటీఆర్ కార్యాలయానికి స్వయంగా వెళ్లిన రామ్..రూ.25 లక్షల చెక్ ను కేటీఆర్ కు అందజేశారు. కాగా ఢిల్లీ ప్రభుత్వం అత్యధికంగా 15 కోట్లు ప్రకటించగా, తమిళనాడు 10 కోట్లు, పశ్చిమ బెంగాల్ 2 కోట్లు విరాళం ప్రకటించాయి.