Advertisement

  • గ్రేటర్ ఎన్నికలపై స్పందించిన టాలీవుడ్ యువ హీరో అడివి శేష్

గ్రేటర్ ఎన్నికలపై స్పందించిన టాలీవుడ్ యువ హీరో అడివి శేష్

By: Sankar Fri, 20 Nov 2020 8:37 PM

గ్రేటర్ ఎన్నికలపై స్పందించిన టాలీవుడ్ యువ హీరో అడివి శేష్


గ్రేటర్ ఎన్నికలపై సినీ నటుడు అడవి శేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఓటు అనేది ఎప్పుడూ ఎంతో ముఖ్యమైనది. హైదరాబాద్‌లో ఉన్న వాతావరణానికి ఇంకొంచెం అభివృద్ధి జరిగితే బాగుంటుంది. మణికొండలాంటి ప్రాంతాల్లో మాటిమాటికీ బోర్లు వేయడం వల్ల కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న గ్రౌండ్‌వాటర్‌ని ఎక్కువగా తోడేస్తున్నామన్నాడు.

అంతేకాదు.. సిటీలో భారీ కన్‌స్ట్రక్షన్స్‌ చేపట్టడం, ఎక్కడ చూసినా సిమెంటు రోడ్లు వేసేస్తున్నామని తెలిపాడు. హైదరాబాద్‌లోని పర్యావరణాన్ని మనం ఇంకొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ఓటుహక్కు అన్నది బ్రహ్మాస్త్రం. ఓటు ద్వారా మన ప్రశ్నలకు సమాధానం దొరికినా, దొరక్కపోయినా లీడర్స్‌కి మనం ఇచ్చే విలువ ఏంటి అంటే ఓటు వేయడమని అడవి శేష్ పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు నగరంలో వాతావరణం విషయంలో ఇప్పుడు ఉన్న అభివృద్ధి కాకుండా ఇంకొంచెం అభివృద్ధి జరగాలని అడవి శేష్ కోరాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే అడివి శేష్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ రైటర్ , హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం 'మేజర్', 'గూఢచారి 2' మూవీస్ లో నటిస్తున్నారు. శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా 'మేజర్ ' మూవీ తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement