కరోనా నుంచి కోలుకున్న టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్..
By: Sankar Tue, 29 Dec 2020 5:06 PM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన అభిమానులకు మంగళవారం గుడ్న్యూస్ చెప్పారు. తాజాగా నిర్వహించిన కరోనా టెస్టులో నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించారు.
కోవిడ్ నుంచి కోలుకున్నట్లు, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు చేశారు. ‘కోవిడ్ నెగిటివ్గా పరీక్షించానని చెప్పడానికి ఆనందంగా ఉంది. నేను పూర్తిగా బాగున్నాను. నాపై చూపించిన మీ ప్రేమకు ధన్యవాదాలు.
మంచి ఆరోగ్యం, సానుకూల దృక్పథంతో 2021ను ప్రారంభించడానికి ఇక ఆలస్యం చేయలేను’ అని ట్వీట్ చేశారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాస్కు ధరించి, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు..కాగా రకుల్ కరోనా నుంచి కోలుకుంది అని ఇండస్ట్రీ లో సంతోషం కలిగేలోపే మరొక ఇద్దరు స్టార్ హీరోలు కరోనా బారిన పడ్డారు ..ఈ రోజు ఉదయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ రాగ , తాజాగా ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా కరోనా బారిన పడ్డారు...