తన ఆరోగ్యంపై సంచలన విషయాలు చెప్పిన టాలీవుడ్ భల్లాలదేవ రానా
By: Sankar Mon, 23 Nov 2020 08:28 AM
టాలీవుడ్ బల్లదేవుడు రానా అభిమానులకు ఒక చేదు వార్త చెప్పాడు...సమంత హోస్ట్గా వ్యవహరించే "సామ్జామ్" కార్యక్రమంలో పాల్గొన్న రానా తన ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. " జీవితం వేగంగా ముందుకెళ్తున్న సమయంలో ఒక చిన్న పాజ్ బటన్ వచ్చింది... పుట్టినప్పటి నుంచి తనకు బీపీ ఉంది. గుండెకు సమస్య తలెత్తుతుంది. నా కిడ్నీలు పాడవుతాయని డాక్టర్లు చెప్పారు.
మెదడులో నరాలు చిట్లిపోవడానికి 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉంటుందని డాక్టర్లు అన్నారు" అని చెబుతూ రానా కన్నీరు పెట్టుకున్నాడు. రానా చెప్పిన మాటలకు హోస్ట్ హీరోయిన్ సమంత కూడా కంటతడి పెట్టుకుంది. కాగా.. రానా ప్రస్తుతం అరణ్య సినిమా చేస్తున్నాడు.
2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.కాగా బాహుబలి సినిమాలో భల్లాలదేవ పాత్రతో దేశం మొత్తం ఫాలోయింగ్ తెచ్చుకున్న రానా ఈ న్యూస్ చెప్పడంతో అభిమానులు తీవ్ర షాక్ కు గురి అయ్యారు..