Advertisement

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన హీరో రాజశేఖర్

By: Sankar Mon, 09 Nov 2020 7:54 PM

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన హీరో రాజశేఖర్


టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా సోకడంతో అందరూ ఆందోళన పడ్డారు.

ఆతర్వాత హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పటల్ లో చికిత్స చేయించుకున్నారు. ఒక్కొక్కరుగా కోవిడ్ నుంచి బయటపడ్డారు. మధ్యలో రాజశేఖర్ ఆరోగ్యం విషమించడంతో అభిమానులంతా కాస్త ఆందోళనకు గురయ్యారు. గత కొద్దీ రోజులుగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతూ వస్తుంది. ఆయన ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వస్తున్నారు.

తాజాగా రాజశేఖర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నెగిటివ్ రావడంతో ఆయన తిరిగి ఆరోగ్యంగా ఉండటంతో డిశ్చార్జ్ చేసారు. ఈ విషయాన్నీ రాజశేఖర్ సతీమణి జీవిత తెలిపారు. తమ కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి అలాగే వైద్యం అందించిన సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Advertisement