నేడే తుంగభద్ర నదీ పుష్కరాలు... స్నానాల్లేకుండా చరిత్రలో ఇదే తొలిసారి...
By: chandrasekar Fri, 20 Nov 2020 11:24 AM
నేడే తుంగభద్ర నదీ
పుష్కరాలు, స్నానాల్లేకుండా చరిత్రలోనే ఇదే తొలిసారి. పవిత్ర
తుంగభద్ర నదీ పుష్కరాలు నేడు ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు జరిగే
పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ పుష్కరాలు నదీ స్నానాల్లేకుండానే
జరగనుండటం విశేషం. గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి
పుష్కరాలు వస్తుంటాయి . ఈ క్రమంలో తుంగభద్ర నదీ పుష్కరాలు నవంబర్ 20 నుంచి
ప్రారంభమై 12 రోజుల పాటు జరగనున్నాయి. డిసెంబర్ 1న
పుష్కరాలు ముగియనున్నాయి. పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో కేంద్ర
ప్రభుత్వ మార్గదర్శకాల్ని అనుసరించి స్నానాల్ని నిషేధించామని మంత్రి చెప్పారు.
లేకుంటే కరోనా వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్లవుతుంది.
కరోనా వల్ల కట్టుదిట్టమైన
చర్యలు తీసుకోవడం వల్ల అంటే నదీ స్నానాల్లేకుండా బహుశా చరిత్రలో జరుగుతున్న తొలి
పుష్కరాలు ఇవే కావచ్చు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ నదీ స్నానాలకు అనుమతి లేదని మంత్రి
ఈ సందర్భంగా గుర్తు చేశారు. తుంగభద్ర నదీ
పుష్కరాల్లో ఉదయం 6 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే
భక్తుల్ని ఘాట్ లోకి అనుమతిస్తామన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్
జగన్ తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొననున్నారు. పుష్కరాల్ని కూడా విపక్షాలు రాజకీయ
కోణంలో చూస్తున్నాయని ఆరోపించారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కరాల
పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేశారన్నారు. కరోనా బాధ లేకుంటే నదీ స్నానాలకు
అనుమతి ఉండేది. దీనివల్ల భక్తులకు తీవ్ర నిరాశ కలిగినట్లు వుంది.