నేడు భారీగా పెరిగిన వెండి ధర
By: chandrasekar Thu, 06 Aug 2020 8:27 PM
బంగారం ధరలు బులియన్
మార్కెట్లో నేడు ఓ మోస్తరుగా పెరిగాయి.
అయితే నిన్న తగ్గిన వెండి ధరలు నేడు ఏకంగా రూ.6వేల
పైగా పెరిగాయి. హైదరాబాద్ స్వచ్ఛమైన బంగారం 10
గ్రాముల ధర రూ.57,820కి
చేరింది. అదే సమయంలో 22
క్యారెట్ల బంగారం 10
గ్రాములపై రూ.930
పెరిగి రూ.53,010కి
ఎగసింది.
ఢిల్లీలోనూ బంగారం ధరలు
భారీగా పెరిగాయి. తాజాగా రూ.950 మేర
పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24
క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10
గ్రాముల ధర రూ.54,700
అయింది. అదే సమయంలో 22
క్యారెట్ల బంగారం అంతే పెరగడంతో 10
గ్రాముల ధర రూ.53,500కి
చేరింది.
వెండి ధర బులియన్ మార్కెట్లో
నేడు కేజీపై రూ.6,450 మేర
తగ్గింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.71,500కి పెరిగింది. తొలిసారిగా వెండి ధర 70 వేల మార్కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే
ధరలో కొనసాగుతోంది.