Advertisement

నేడు భారీగా పెరిగిన వెండి ధర

By: chandrasekar Thu, 06 Aug 2020 8:27 PM

నేడు భారీగా పెరిగిన వెండి ధర


బంగారం ధరలు బులియన్ మార్కెట్‌లో నేడు ఓ మోస్తరుగా పెరిగాయి. అయితే నిన్న తగ్గిన వెండి ధరలు నేడు ఏకంగా రూ.6వేల పైగా పెరిగాయి. హైదరాబాద్‌ స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.57,820కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.930 పెరిగి రూ.53,010కి ఎగసింది.

ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. తాజాగా రూ.950 మేర పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,700 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం అంతే పెరగడంతో 10 గ్రాముల ధర రూ.53,500కి చేరింది.

వెండి ధర బులియన్ మార్కెట్‌లో నేడు కేజీపై రూ.6,450 మేర తగ్గింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.71,500కి పెరిగింది. తొలిసారిగా వెండి ధర 70 వేల మార్కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో కొనసాగుతోంది.

Tags :
|

Advertisement