Advertisement

  • ఒక్క మ్యాచ్ నాలుగు జట్ల ఆశలు ..నేడే కీలక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రాజస్థాన్ రాయల్స్ పోరు

ఒక్క మ్యాచ్ నాలుగు జట్ల ఆశలు ..నేడే కీలక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రాజస్థాన్ రాయల్స్ పోరు

By: Sankar Fri, 30 Oct 2020 09:47 AM

ఒక్క మ్యాచ్ నాలుగు జట్ల ఆశలు ..నేడే కీలక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రాజస్థాన్ రాయల్స్  పోరు


ఐపీయల్ లీగ్ దశ ముగింపునకు వచ్చినా.. ప్లేఆఫ్ చేరే జట్ల విషయంలో స్పష్టత లేదు. ఇప్పటి వరకూ ముంబై ఇండియన్స్ మాత్రమే ప్లేఆఫ్ చేరగా.. బెంగళూరు, ఢిల్లీ జట్లు కూడా ప్లేఆఫ్ చేరడం తేలికే. ఇక మిగిలిన ఒక్క బెర్త్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. చెన్నై చేతిలో ఓడిన కోల్‌కతా చివరి మ్యాచ్‌లో గెలిస్తే.. 14 పాయింట్లు సాధిస్తుంది. కానీ నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో ఆ జట్టు ప్లేఆఫ్ చేరే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

ఇక ప్లేఆఫ్ రేసులో ముందంజలో ఉన్న మరో జట్టు కింగ్స్ ఎలవెన్ పంజాబ్. వరుస విజయాలతో దూకుడు మీదున్న పంజాబ్.. నేడు (అక్టోబర్ 30) రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే.. 14 పాయింట్లతో ఆ జట్టు ప్లేఆఫ్‌కు మరింత చేరువ అవుతుంది. మరోవైపు రాజస్థాన్‌కు కూడా ప్లేఆఫ్ చేరే అవకాశాలు మ్యాథమెటికల్‌గా మిగిలే ఉన్నాయి. చివరి మ్యాచ్‌ల్లో ఆ జట్టు గెలిచి.. పంజాబ్, సన్‌రైజర్స్, కోల్‌కతా ఓడితే.. రాజస్థాన్ ప్లేఆఫ్‌కు చేరొచ్చు.

పంజాబ్‌పై రాజస్థాన్ విజయం సాధిస్తే.. ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడంతోపాటు.. సన్‌రైజర్స్‌కు సైతం కలిసొస్తుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడితే.. రాహుల్ సేన గరిష్టంగా 14 పాయింట్లు మాత్రమే సాధిస్తుంది. సన్‌రైజర్స్ చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది.

Tags :

Advertisement