Advertisement

తెలంగాణలో కొత్తగా 2,123 కరోనా కేసులు నమోదు

By: Anji Sat, 19 Sept 2020 10:02 AM

తెలంగాణలో కొత్తగా 2,123 కరోనా కేసులు నమోదు

ఈ రోజు శనివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తెలంగాణలో కొత్తగా మరో 2,123 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వల్ల 9 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,69,169 చేరాయని బులిటెన్‎లో తెలిపింది. మొత్తం 1,37,508 మంది డిశ్చార్జ్‌ కాగా, రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1,025మంది చెందారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 30,636 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 305 కేసులు కాగా, ఇక జిల్లాల వారీగా చూసినట్లయితే.. రంగారెడ్డి 185, మేడ్చల్‌ 149, నల్గొండ 135, కరీంనగర్‌లో 112 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Tags :
|

Advertisement