పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 100 సీట్లు కూడా గెలవదు
By: Sankar Sun, 04 Oct 2020 4:30 PM
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ 100 సీట్లు కూడా గెలువదని బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్వర్గీయ జోష్యం చెప్పారు.
ఆదివారం మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో విజయ్వర్గీయ మీడిమా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2021లో జరుగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు దక్కడం కూడా గగనమేనని వ్యాఖ్యానించారు.
పశ్చిమబెంగాల్ బీజేపీ వ్యవహారాల పరిశీలకుడు కూడా అయిన విజయ్వర్గీయ అక్కడి రాజకీయ పరిస్థితులపై కూడా మాట్లాడారు. కొందరికి దేశం కంటే పార్టీయే ముఖ్యమని, అందుకే దేశ పౌరులు ఈసారి వారికి బుద్ధి చెప్పబోతున్నారని పరోక్షంగా మమతాబెనర్జీని ఉద్దేశించి విజయ్వర్గీయ వ్యాఖ్యానించారు. ఈ మధ్య తాను చాలా సమయం బెంగాల్లో గడిపానని, మమతాబెనర్జీ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు రావడం కూడా కష్టమేనని ధీమాగా చెప్పగలనని ఆయన పేర్కొన్నారు.