Advertisement

Tirupati By Elections 2020: ఉప ఎన్నిక పై ఫోకస్ పెట్టిన జగన్..!

By: Anji Tue, 15 Dec 2020 2:04 PM

Tirupati By Elections 2020: ఉప ఎన్నిక పై ఫోకస్ పెట్టిన జగన్..!

తిరుపతి ఉప ఎన్నిక హడావిడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ నోటిఫికేషన్ రాకముందే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాయి.

టీడీపీ ఇప్పటికే పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించగా.. వైఎస్సార్‌సీపీ డాక్టర్ గురుమూర్తిని బరిలోకి దింపుతుందనే ప్రచారం జరుగుతోంది.

ఇక జనసేన, బీజేపీలు అభ్యర్థి ఎంపికపై క్లారిటీకి రాలేదు. ఇదిలా ఉంటే వైఎస్సార్‌సీపీ కూడా ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది.

తిరుపతిలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సమావేశమయ్యారు.

ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా ముందుగానే ప్రణాళికలు రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని మంత్రులు సూచించారు.

ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోనే ముఖ్యమంత్రి జగన్‌ ద్వారా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 25న ఏర్పాటు చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. ఇందుకు ముఖ్యమంత్రికి ప్రతిపాదనను పంపాలనే నిర్ణయం తీసుకున్నారు.

ఉప ఎన్నిక కోసం టీడీపీ, బీజేపీలు దూకుడు పెంచాయని.. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు.

ఉప ఎన్నికపై కసరత్తులో భాగంగా ఈ నెల 27 న పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రాంతాల వారీగా ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.

Tags :

Advertisement