Advertisement

  • ఐపీఎల్‌-2020 సీజన్ మొత్తం...ఒక్క ముంబైలోనే...బీసీసీఐ

ఐపీఎల్‌-2020 సీజన్ మొత్తం...ఒక్క ముంబైలోనే...బీసీసీఐ

By: chandrasekar Fri, 03 July 2020 3:42 PM

ఐపీఎల్‌-2020 సీజన్ మొత్తం...ఒక్క ముంబైలోనే...బీసీసీఐ


ఈ సంవత్సరం ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నది. అవసరమైతే ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉంది. ఐపీఎల్‌-2020 సీజన్‌ మొత్తాన్ని ముంబైలోనే నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనపైనా ఉన్నతస్థాయి సమావేశంలో చర్చకు వచ్చింది.

సెప్టెంబర్‌-అక్టోబర్‌ విండోలో ఐపీఎల్‌ను నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి కనబరుస్తున్నది. ఐతే ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్‌ కప్‌ నిర్వహణపై ఐసీసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీసీసీఐ వేచిచూస్తున్నది.

ఈ ఏడాది ఐపీఎల్‌ జరిగితే ఒక్క నగరానికే పరిమితం చేయాలని వస్తున్న వార్తలపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. 'భారత్‌లో ఐపీఎల్‌-2020 నిర్వహించాల్సి వస్తే, అక్టోబర్‌ నాటికి ముంబైలో కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తేనే అది కూడా సాధ్యమవుతుంది.

అత్యాధునిక ఫ్లడ్‌లైట్ల సౌకర్యాలతో ముంబైలో నాలుగు మైదానాలున్నాయి. బీసీసీఐ, మ్యాచ్‌ బ్రాడ్‌కాస్టర్స్ కార్యాలయాలతో పాటు బయో బబుల్‌ వాతావరణాన్ని మెయింటేన్‌ చేయడంతో సహా ప్రతీది ఇక్కడ సజావుగా నిర్వహించవచ్చని' ఆయన పేర్కొన్నారు. కరోనా నియంత్రణలోకి వస్తేనే లీగ్‌ నిర్వహించడానికి వీలవుతుందన్నారు. ముంబైలో వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్‌తో పాటు రిలయన్స్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు కూడా ప్రత్యేక మైదానం ఉన్నది.

Tags :
|
|

Advertisement