మెదక్లో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు
By: chandrasekar Thu, 28 May 2020 4:12 PM
మెదక్లో 120 అడుగుల లోతున్న బోరుబావిలో ప్రస్తుతం 20 అడుగుల లోతులో బాలుడు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
తమ బాబు పరిస్థితిని తలచుకొని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మళ్లీ అదే దారుణం, అదే నిర్లక్ష్యం బోరుబావుల్లో పడిపోయి ఎంతో మంది
చిన్నారులు చనిపోతున్నా వ్యవస్థలో మార్పు రావడం లేదు. మృత్యు కుహరాల్లా నోళ్లు
తెరిచిన బోరుబావులకు పసిపిల్లలు బలవుతూనే ఉన్నారు. తాజగా మెదక్లో మరో బారుబావి
ఘటన చోటుచేసుకుంది.
పాపన్నపేట మండలం పొడ్చన్పల్లి
గ్రామంలో మూడేళ్ల బాలుడు సాయివర్ధన్ బోరుబావిలో పడిపోయాడు. పొలంలో ఆడుకుంటూ వెళ్లి
ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటానా స్థలానికి చేరుకొని సహాయక
చర్యలు చేపట్టారు.
తాడు సాయంతో పైకి
లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో పాటు బోరుబావికి సమాంతరంగా పొక్లైనర్లతో
గొయ్యి తవ్వుతున్నారు. 120
అడుగుల లోతున్న బోరుబావిలో ప్రస్తుతం 20
అడుగుల లోతులో బాలుడు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తమ బాబు పరిస్థితిని తలచుకొని
తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.