ముగ్గురు మహిళా క్రికెటర్లకు కరోనా పాజిటివ్ ..
By: Sankar Sun, 26 July 2020 1:16 PM
సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు బృందంలో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. క్రికెటర్లు, సహాయక సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) వెల్లడించింది. ఇందులో సహాయ సిబ్బంది ఒకరు ఉన్నారు. 'ముగ్గురికి కరోనా పాజిటివ్గా తేలింది.
పాజిటివ్గా తేలిన ముగ్గురు 10 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంటారు. శిక్షణ శిబిరానికి దూరంగా ఉంటారు. ముగ్గురిలోనూ కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి. సీఎస్ఏ మెడికల్ టీమ్ వీరిని పర్యవేక్షిస్తుందని' సీఎస్ఏ పేర్కొంది.
జాతీయ శిబిరానికి హాజరయ్యే క్రికెటర్ల బృందానికి ముందు జాగ్రత్త చర్యగా 34 రకాల పరీక్షలు నిర్వహించినట్లు బోర్డు తెలిపింది. ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో వీళ్లంతా ట్రైనింగ్కు హాజరుకావాల్సి ఉంది. క్రికెటర్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్కు మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు.